సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చుంచుపల్లి : అగ్రవర్ణ పార్టీలకు,అగ్రవర్ణ పార్టీల నాయకులకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని చుంచుపల్లి తండాలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ ఎందుకు సీఎం కావాలి అనే కరపత్రాలు పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆరు నెలల ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ ను ఎందుకు ప్రకటించింది? అతను ఆరున్నర సంవత్సరాల ప్రభుత్వ సర్వీస్ కాలం మిగులుండగానే అత్యున్నత ఐపీఎస్ ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశారనే పరిణామాలన్ని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలన్నారు.గత 70 ఏళ్ళ పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,ప్రస్తుత తెలంగాణలో కేవలం ఆధిపత్య వర్గాల నాయకులే ముఖ్యమంత్రులు అయ్యారని 90 శాతానికి పైగా ఉన్న బహుజనులు మాత్రం అడుగడుగునా తొక్కివేయబడి కేవలం కూలీలుగా జీవిస్తున్నారని,తరతరాలుగా మన తాతలు,తండ్రులు కూలీ పని మీద ఆధారపడి బతుకుతుంటే,ఆధిపత్య వర్గాలు మాత్రం మన భూములు గుంజుకొని ఫంహౌస్ లు కట్టుకున్నారని ఇంకెంత కాలం మోసపోదామన్నారు.మళ్ళీ ఈసారి కూడా దోపిడీ దొరల మాయమాటలు నమ్మి వారికి ఓట్లేస్తే మరోసారి బొందలో పడి బానిసత్వంలో మునగడం ఖాయమని అందుకే అప్రమత్తంగా ఉండి బీఎస్పీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈకార్యక్రమంలో సాయి,జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,భూక్యా శంకర్,భీముడు,కవిత,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin