సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం "ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవ సందర్భంగా స్వచ్ఛత రన్" కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈసందర్భంగా ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, ఎంపీడీఓ సంతోష్ కుమార్,సర్పంచి భూస సునీత,ఉపసర్పంచి షేక్ వాహబ్,అధికారులు,వార్డు సభ్యులు,విద్యార్థులతో కలిసి ప్రమాణం చేశారు.గ్రామంలో ప్రాంతాలను పారిశుద్ధ్యoగా ఉంచే బాధ్యత ప్రతీఒక్కరిదని అన్నారు.మండల కేంద్రంలోని పలు వార్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్,పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య,ఎంపీటీసీలు మామిడి దివ్యా-రాకేష్, కన్న లింగవ్వ-పోశెట్టి,వార్డు సభ్యులు పుప్పాల లావణ్య-విద్యా సాగర్,పిళ్లేండ్ల శివప్రసాద్,గాండ్ల రాజేష్,సయ్యద్ రియాజ్ ఆలీ,అక్తరి బేగం,సూపర్ డెంట్,జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్,టైపిస్టు రవి,అంగన్వాడీ టీచర్లు,విద్యార్థులు, గ్రామ పంచాయితీ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin