సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం రోజున ప్రాథమిక సహకార సంఘం మహ్మదాపురం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం ఉందని,మొక్కజొన్న పంటకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తాం అని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తమ పంటను మధ్యవర్తుల వద్ద అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని సూచించారు. మొక్కజొన్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాలుకు రూ. 2400 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, తహసిల్దార్ ముస్కు సమ్మక్క, సర్పంచ్ పొగాకు శోభ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ మాటేటి రవి, మార్కెట్ డైరెక్టర్ రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు, చెన్నూరి కిరణ్ రెడ్డి, హింగే రాజేశ్వరరావు,మండల నాయకులు బండారి ప్రకాష్, మట్ట రాజు, కూరతోట సురేష్,బూర హేమచందర్ గౌడ్, ముత్యాల కుమారస్వామి, జంగిలి రాజు, మరియు అధికారులు మండల ముఖ్య నాయకులు గ్రామ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter