Wednesday, 29 July 2026 05:06:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భూ కుంభకోణంలో అనుముల తహసీల్దార్ వజ్రాల జయశ్రీ అరెస్ట్...

Date : 10 October 2024 03:10 AM Views : 640

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలంలో భారీ ప్రభుత్వ భూ కుంభకోణం చోటు చేసుకుంది ఈ కుంభకోణంలో గతంలో హుజూర్ నగర్ తహసీల్దార్ గా పని చేసిన వజ్రాల జయశ్రీ మరియు ధరణి ఆపరేటర్ జగదీష్ ప్రధాన సూత్రదారులు. హుజూర్ నగర్ మరియు బూరుగడ్డ గ్రామాల రెవెన్యూ పరిధిలో 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతర వ్యక్తుల పేర్లపై అక్రమంగా మార్పిడి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన అప్పటి తహసీల్దార్ వజ్రాల జయశ్రీ, కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ లను 220(బి),406,409,420,467,468 సెక్షన్ల క్రింద అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగినది. హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం 2019 నవంబర్ నుండి 2020 ఫిబ్రవరి మధ్యకాలంలో నాటి హుజూర్ నగర్ తహసీల్దార్ వజ్రాల జయశ్రీ ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ ఇద్దరు ఉన్నతాధికారులకు తెలియకుండా అక్రమంగా బురుగడ్డ రెవెన్యూ పరిధిలో 16.30 గంటల భూమిని పచ్చిపల ప్రియాంక పేరున, 4.38 ఎకరాల భూమిని జగదీష్ అక్క మడిపల్లి స్వప్న పేరున మరియు హుజూర్ నగర్ రెవెన్యూ పరిధిలో గల 14.36 గంటల భూమి తల్లి ప్రియాంక పేరున ప్రభుత్వ భూమిని (మొత్తం 36.23 ఎకరాలు, విలువ 1,56,24,437.5/- ) ILRMS పోర్టల్ ద్వారా బాధలాయించి చేసి 14,63,004/ రూపాయల రైతు బంధు సొమ్ము లబ్ధి పొందినట్లుగా విచారణలో తెలినందున ఇరువురిని బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా స్థానిక జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు తహసీల్దార్ వజ్రాల జయశ్రీ, ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ లను హుజూర్ నగర్ పోలీసులు స్థానిక సబ్ జైలుకు తరలించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :