సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేష్ యువ గళం పాదయాత్ర చేపట్టిన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబులదేవర చెరువు ,నల్లమాడ, అమడుగురు మండలాల్లో ఉన్న టిడిపి కార్యకర్తలు, నాయకులతో కలిసి నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం చేయాలని. చర్చించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి . మొదట నల్లమా డ లో నారా లోకేష్ యువ గళం పాదయాత్ర విజయవంతంపై టీడీపీ కార్యకర్తల తో మాజీమంత్రి పల్లె ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి పంచాయతీ నుంచి వందల సంఖ్యలో ప్రజలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నేటి నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ మండలంలోని పులగంపల్లి కి మధ్యాహ్నం 3 గంటలకు నారా లోకేష్ కదిరి నియోజకవర్గం నుంచి చేరుకొంటుందని అన్నారు. అక్కడ నారా లోకేష్ కు భారీ ఎత్తున స్వాగతం పలకాలని అన్నారు. అక్కడి నుంచి నారా లోకేష్ ఓడి చెరువు మండలం మిట్టపల్లి వద్ద వికలాంగులతో ముఖాముఖి ఉంటుంది. మండలంలోని వణుకు వారిపల్లి వద్ద లోకేష్ కు ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో బస చేస్తారు. ఉగాది సందర్భంగా నారా లోకేష్ పాదయాత్ర కు విరామం ప్రకటించారు. ఈ నెల 25 న నారా లోకేష్ యువ గళం చేపట్టే పాదయాత్ర సందర్భంగా ఓబులదేవర చెరువు మండలం లో ని వేమారెడ్డి పల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక ఏర్పాట్ల ను మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఓడిసి టీడీపీ కార్యాలయంలో మండలంలోని అన్ని పంచాయతీలను నుంచి విచ్చేసిన టీడీపీ కార్యకర్తల తో లోకేష్ పాదయాత్ర విజయవంతం పై ప్రత్యేకంగా చర్చించారు. పాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించడానికి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తో పాటు నల్లమాడ కన్వీనర్ మైలే శంకర్ ,ఓడి చెరువు మండల కన్వీనర్ జయ చంద్ర , మండల ప్రధాన కార్యదర్శి పిట్ల సుధాకర్, రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి జరిపిటి అంజనప్ప, మండల టీడీపీనాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు....
-----------------------
Admin