సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: ఏఎన్ఎం లను రెగ్యులర్ చేసి,వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం బస్టాండ్ సెంటర్ లో ఏఎన్ఎం లు చేస్తున్న 15వ రోజు సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయకుండా కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.2012 కు ముందు రెగ్యులర్ చేసి 2012 తర్వాత నుండి నేటి వరకు వీరిని రెగ్యులర్ చేయడం లేదని అన్నారు.ఏఎన్ఎం లకు కనీసం ప్రసూతి సెలవులు కానీ,ఆరోగ్య భద్రత కానీ లేదని ఆవేదన వ్యక్తంచేశారు.సర్వీస్ లో ఉన్న డాక్టర్లను అనుభవంతో సంభంధం లేకుండా రెగ్యులర్ చేసినప్పుడు ఏఎన్ఎం లను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదని ప్రశ్నించారు.కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందించారని గుర్తుచేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఏఎన్ఎం లుగా పనిచేస్తున్న వారందరిని ఎటువంటి రాత పరీక్ష లేకుండా అనుభవం ప్రకారం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అల్లకొండ శరత్,తాటిపాముల హరిక్రిష్ణ,సందేల సందీప్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin