సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ రాష్ట్ర గంజాయి దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందులో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద సుమారు కోటీ 35 లక్షల విలువ గల 550 కేలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లు,1.50 లక్షల నగదు, ఒక డీసీఎం స్వాధీనం చేసు కున్నారు. ఇతర రాష్ట్రాల్లో గంజాయి కి భారీ డిమాండ్ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఎల్బినగర్ డిసిపి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని మూడు బృందాలు ఏర్పాటు చేసి వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
-----------------------
Admin