సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (అర్బన్ ): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని చిట్టి రామవరం లో 14 నెంబర్ పి హెచ్ సి ఆధ్వర్యంలో విస్తృతంగా ఫీవర్ సర్వే నిర్వహించారు. గురువారం స్థానిక చిట్టి రామవరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్, డాక్టర్ ఇస్లావత్ రాములు మాట్లాడుతూ విష జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధుల ప్రమాదపరితంగా వస్తున్నాయని అన్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్, విషజ్వరాల బారి నుండి రక్షణ పొందాలని వారన్నారు. ఈ సీజన్లో మలేరియా, డెంగ్యూ ,టైఫాయిడ్ తదితర వైరల్ జ్వరాలు వస్తున్నాయని వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది డి పద్మావతి ,ఏవో వి శ్రీనివాసరావు, ఫార్మసిస్ట్ అక్బర్, ఏఎన్ఎం కవిత, శ్రీలక్ష్మి, భవాని , సుదర్శన్ ఏరియా పెద్దలు రాంప్రసాద్, ఓస్య, లింబ, మూడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin