సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గల గాంధీనగర్ లో ఆదివారం కాంగ్రెస్ నాయకులకు సమస్యలు చెప్పుకున్న గ్రామస్తులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నామని చాలాసార్లు ఎమ్మెల్యే మాకు మాట ఇచ్చి రోడ్లు,కరెంటు స్తంభాలు,మంచినీటి పైపులైను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని.. కొన్ని రోజుల క్రితం (ఏ మ్మెల్యే )గాంధీనగర్ వచ్చినప్పుడు అడిగితే ఏమో నాకు గుర్తు లేదని అన్నారు మా దగ్గర ఉన్న వీడియోలు ఫోటోలు కూడా చూపించిన మాకు రోడ్డు శాంక్షన్ చేయలేదని చెప్పుకొని ఆవేదన చెందారు... ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మార వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ... మీకు రోడ్డు సమస్య ఉన్నది కరెంటు స్తంభాలు లేవు సరైన మౌలిక వసతులు లేవని.. మంచినీటి సమస్య కూడా ఉన్నదని కొన్ని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మీకున్న ప్రతి సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. అలాగే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల గురించి వివరించారు... ఈ కార్యక్రమంలో మారం వెంకటేశ్వర రెడ్డి, యారం పిచ్చిరెడ్డి, మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు , యువకులు కళ్యాణ్, ఈశ్వర్, గంటా మల్లికార్జున్, శ్రీను, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin