Saturday, 18 April 2026 08:09:33 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

సచివాలయ ఉద్యోగులు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలి...

Date : 29 November 2022 11:46 PM Views : 351

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలోని జెండా వేపమను వార్డు సచివాలయం-2 , కర్నాటక నాగేపల్లి వార్డు సచివాలమం-5,  పెద్దబజారు వార్డుసచివాలయం-3  ఆకస్మికంగా తనిఖీ చేసినా జిల్లా కలెక్టర్ ...                                      సచివాలయాలకు వస్తున్న సర్వీసులను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా గడువులోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. పుట్టపర్తిలోని జెండా వేపమను వార్డు సచివాలయం-2 , కర్నాటక నాగేపల్లి వార్డు సచివాలమం-5,  పెద్దబజారు వార్డు సచివాలయం- 3 జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా సచివాలయాలలో సచివాలయ ఉద్యోగులు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సచివాలయ వ్యవస్థలో విధులు నిర్వర్తించే ఉద్యోగులందరూ కూడా చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తించాలని సిబ్బంది ఆదేశించారు  తదుపరి సచివాలయ కార్యాలయంలో గల అన్ని రికార్డులను పరిశీలించారు. వివిధ సంక్షేమ పథకాలు గోడపత్రికలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయవలసిన అంశాలన్నీ కూడా వెనువెంటనే అప్లోడ్ చేయాలని ఆయా వార్డ్ సచివాలయాల సిబ్బందికి సూచించారు. నిర్లక్ష్యంగా ఉంటే అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, కఠిన చర్యలు కూడా తప్పవని సూచించారు. ప్రజలలో మమేకమై సమస్యలను విని పరిష్కరించినప్పుడే సచివాలయ వ్యవస్థకు మంచి గుర్తింపు లభిస్తుందని  తెలిపారు ఈశ్రమ్ పోర్టల్ లో ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ 100 శాతం  నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు   ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందజేసేలా చూడాలన్నారు. సచివాలయాలకు వస్తున్న సర్వీసులను గడువులోపు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య కార్యకర్తలు  వైద్య సేవలు ప్రజలకు అందజేయాలని తెలిపారు. పారిశుద్ధ్య నివారణపై  ప్రజలకు  అవగాహన కార్యక్రమాలు  నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, కౌన్సిలర్ చెరువు భాస్కర్ రెడ్డి సచివాల సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :