సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండల కేంద్రంలోని సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, తన పదవికి రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని అధికారులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు రైతులకు నిజాయితీగా పని చేశానని ఎరువులు విత్తనాల కొనుగోలు కేంద్రాల ద్వారా రు 22.10 కోట్ల వ్యాపారం చేసి సొసైటీకి రు32.81 లక్షల లాభాన్ని తీసుకు వచ్చామని తన వ్యక్తిగత కారణాలవల్ల సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు మీడియా మిత్రులు మండల నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin