సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలోని ఫరుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సిరాజ్ అనే నిరుపేద వ్యక్తి డాబా పై నుండి రాత్రి కిందపడి మృతి చెందాడు. నిరుపేద వ్యక్తి అయిన సిరాజ్ భార్య జరినాబి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాత్రి దాబాపై నుండి సిరాజ్ కాలుజారి కిందపడ్డాడు. అయితే కింద పడగానే సంఘటన స్థలంలో సిరాజ్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కూలినాలి చేసుకొని జీవించే సిరాజ్ అతని భార్య జరినాబీ కడు నిరుపేదలు. ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ పట్టణ మహిళా నాయకురాలు ఉమాదేవి వారి పరిస్థితిపై జాలిపడి 5000 రూపాయలను అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం చేశారు. ఎంతో నిరుపేద కుటుంబం అని ఆ కుటుంబానికి మానవతా హృదయం కలవారు పెద్ద మనసుతో స్పందించి ఏదైనా సాయం చేయాలని ఉమాదేవి ఈ సందర్భంగా కోరారు.
-----------------------
Admin