సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండల కేంద్రంలోని ఎమ్మెస్ భవనంలో సిపిఎం పార్టీ మండల జనరల్ బాడీ యానాల సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి ఎస్ కే యాకూబ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అప్రజా స్వామికంగా వ్యవహ రిస్తుందని ఆయన అన్నారు. గృహలక్ష్మి పథకం, బీసీ బందు ,మైనార్టీ లోన్లు, దళిత బంధు లాంటివి గ్రామసభల ద్వారా ఎంపిక చేయాకుండా కేవలం అధికార పార్టీ నాయకుల కధంబ హస్తాల్లోనే నడుస్తున్నాయని అని అన్నారు . ఇతర పార్టీల నాయకులను బీసీ బందు పేరుతో మైనార్టీ బందు పేరుతో చిన్న పెద్ద నాయకులను మార్చుకోవటం సరైన పద్ధతి కాదని ఇలాంటి ఆశలు చూపి మార్చుకోవటం మూలాన ఉన్న పార్టీ ఊడిపోతుందని అన్నారు .ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన కొనసాగాలని ఇతర పార్టీల ప్రజా పరిధిలో ఉన్న దగ్గర కనీసం సర్పంచులు ఎంపీటీసీలు కూడా తెలియకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే మొత్తం స్టీరింగ్ మైంటైన్ చేస్తున్నారని అన్నారు .మరి ప్రజా ప్రజలు ఎందుకు గ్రామాల్లో మీరే నామినేట్ చేసుకోండి అన్నిటిని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో ఇలా చేయటం మూలాన తొమ్మిది సంవత్సరాలుగా ఇంటిలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని మీరు అలాగే చేస్తే మీకు అదే గతి పడుతుందని యాకూబ్ అన్నారు . ఎంపిక చేయాలని పరిపాలన ప్రజలందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలంటే గ్రామసభల ద్వారానే జరపాలని యాకూబ్ డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో అంబటి బిక్షం ,మహబూబ్ అలీ, దోసపాటి భిక్షం ,యానాల సోమయ్య ,ఎస్ కే హుస్సేన్ ,మచ్చ వెంకటేశ్వర్లు ,గుడపు లక్ష్మయ్య , బొల్లెపల్లి శ్రీనివాస్ ,దోసపాటి సుధాకర్, ఆకుల అరవింద్ ,కందుకూరి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin