సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని కృష్ణ తండా గ్రామ పంచాయతీలో తుల్జా భవాని జాతర సందర్భంగా కోలాటం ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కోలాటం ప్రోగ్రామ్ మాజీ సర్పంచ్ బానోతు రామారావు నాయక్ ఆధ్వర్యంలో, కోలాటం మాస్టర్ బాలాజీ, రమేష్ సారధ్యంలో జరిగింది. ఈ సందర్భంగా కోలాటం ప్రోగ్రాంను రామారావు నాయక్ ప్రారంభించి మాట్లాడుతూ తుల్జా భవాని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని, కోలాటం ప్రోగ్రాంను ప్రశాంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులు యువకులకు అభినందించారు. అనంతరం కోలాటం బృందం వారు మాజీ సర్పంచ్ బానోతు రామారావు నాయక్ ని, మాజీ ఉప సర్పంచ్ సైదా నాయక్ ని శాలువా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మట్టపల్లి, సైదా, శ్రీను,రావుజ్య, కోలాటం కమిటీ సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు,మహీళలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin