సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ(ఎం ) జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకట్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133 జయంతి సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో అమరవీరుల స్మారక భవనంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. సిఐటి యు జిల్లా ఉపాధ్యక్షులు శీలం శీను అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అత్యున్నత స్థానాలకు ఎదగాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గమని ప్రతి ఒక్కరూ చదువు విజ్ఞానంపై దృష్టి పెట్టాలని తెలిపారు .డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిమ్మకులంలో జన్మించినప్పటికీ అత్యున్నత చదువులు చదివి ప్రపంచ మేధావిగా ఎదిగారని ఐక్యరాజ్యసమితి సహితం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవాలు జరుపుతున్నాయంటే ఎంతటి మహానుభావుడు అర్థం చేసుకోవాలని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో ప్రజలందరూ సమానమేనని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేదల కోసం అనేక హక్కులను ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అని కొనియాడారు, నేడు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని పెట్టుబడిదారులు దేశ సంపదను దోపిడీ చేస్తున్నారని ఎన్ని చట్టాలు వచ్చినా తప్పించుకొని తమకు అనుకూలమైన విధానాలు తీసుకురావడం దుర్మార్గమని తెలిపారు ,నేటికీ అసమానతలు కొనసాగుతున్నాయని అసమానతలు లేని సమాజం కొరకు పోరాడుదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి బ్రహ్మం, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్, టౌన్ కార్యవర్గ సభ్యులు తుమ్మ కొమ్మ యోన, రేపాకుల మురళి, జక్కుల వెంకటేశ్వర్లు, చిన్నం వీరమల్లు, వెంకట్ రెడ్డి, జి. శ్రీను, శీలం వెంకన్న, మీసాల వీరబాబు , పాశం వీరబాబు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin