సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల : ఐ.కె.పి. 2020/2021వ సంవత్సరము నందు చిల్లేపల్లి పి.ఏ.సి.యస్. సంఘం నందు జరిగిన అక్రమ అవకతవకల మండల రెవిన్యూ అధికారి కి వినతి పత్రం అందజేసిన బహుజన్ సమాజ్ పార్టీ ఈ కార్యక్రమం లో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ ఐ.కె.పి. 2020/21వ సంవత్సరములో ధాన్యం ఐ.కె.పి. ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం సంఘ పరిధిలో ఉన్న రైతుల నుండి కొనుగోలు చేయవలసి ఉండగా సంఘ చైర్మన్ మరియు సి.ఇ.ఓ., మిల్లు యాజమాన్యం వారితో కుమ్మక్కై దాదాపుగా 1,25,772 బస్తాల ధాన్యం కొనుగోలు చేసి సంఘ పరిధిలోని రైతులు కాకుండా వేరే ప్రాంతం రైతుల పేర్ల పైన సంబధిత బిల్లులు తయారు చేసి కొంతమంది స్వాహా చేసినారు. గతములో కూడా మార్ఫెడ్ కు చెల్లించాల్సిన నగదును చెల్లించకుండా కొంతమంది వాడుకోవడం. ఆ తర్వాత ఆడిటర్ వారి హెచ్చరికతో పై అధికారులు ఆదేశించగా మార్ఫైడ్లో వాడుకున్న 5 లక్షలు కట్టారు . ఇట్టి విషయముపై సమగ్ర విచారణ విచారణ జరిపి, బాద్యులైన వారి చట్టపరమైన చర్యలు తీసుకొక పొతే రైతులతో కలిసి ఎంత దూరం పోవడానికైనా బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెదపంగ ఉపేందర్ నియోజకవర్గ అధ్యక్షులు జీలకర్ర రామస్వామి, మండల అధ్యక్షులు తక్కెల్ల నాగార్జున, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin