సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని మేళ్ల చెర్వు రోడ్ లో గల శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నియోజక వర్గ గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో నియోజకవర్గ గిరిజన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే శానం పూడి సైది రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి ,రాష్ట్ర గిరిజన ముఖ్య నాయకులు రమణ నాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు.తదనంతరం గిరిజన ఆత్మీయ సమావేశం ను ఉద్దేశించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైది రెడ్డి మాట్లాడుతూ గూడేలను,తండాలను గ్రామ పంచాయతీలు గా మార్చాలని గిరిజనులు ఎన్నో ఏండ్లు పోరాడినా గత ప్రభుత్వాలు పట్టించుకో లేదని,ఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రాష్ట్రంలో 4 వేల తండాలను,నియోజక వర్గ పరిధిలో 49 గూడెలను,తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా చేసినామని తెలిపారు.నూతన గ్రామ పంచాయతీ భవనాలు ఏర్పాటు చేశాము. దీంతో గిరిజనులు స్వయంపాలన సాగిస్తున్నారని చెప్పారు. గిరిజనులకు పొడు భూములు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల భూమికి పోడు పట్టాలు పంపిణీ చేయడంతోపాటు త్రీఫేజ్ కరెంటు ఇస్తున్నామని తెలిపారు.గిరిజనులకు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. హైదరాబాద్ నడి బొడ్డున బంజారా హిల్స్ లో బంజారా భవన్, ఈ పట్టణంలో గిరిజన భవన్ నిర్మాణం చేసుకోవడం జరిగింది .మఠం పల్లి రైల్వే స్టేషన్ కి సంత్ సేవా లాల్ పేరు పెట్టుకోవడం జరిగింది. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవ లాల్ మహారాజ్ జయంతి ని ప్రతి సంవత్సరం అధికారంగా నిర్వ హించడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ నాయకత్వం లో మన తెలంగాణ ను లౌకిక రాష్ట్రంగా నిలుపు తున్నామని,కులం, మతం తేడా లేకుండా అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు పోతున్నామని తెలిపారు. గిరిజన (లంబాడా) ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమములో రాష్ట్ర నాయకులు,నియోజకవర్గ గిరిజన ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin