సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని సుల్తాన్ పురం తండా, గుర్రంపోడు తండా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపిన విధంగా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్నారు.వంటింటి గ్యాస్ రూ. 500 కే ఇస్తామని చెప్పిన విధంగా అర్హులైన ప్రతి కుటుంబానికి అందజేయాలన్నారు.ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రూ. ఐదు లక్షలు అందజేయాలని, ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ లో ముందుగా వృద్దులు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఆసరా పింఛన్ పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని ఎంపీపీ పార్వతి కొండా నాయక్ అన్నారు. పెన్షన్ కు అర్హులైన కొత్తవారు మాత్రమే చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.అధికారులు ప్రతి ఒక్కరి దరఖాస్తులు స్వీకరించాలనీ ఎంపీపీ పార్వతి కొండా నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ సంధ్యారాణి , ఎమ్మార్వో మంగా , ఎంపీడీవో జానకి రాములు , ఎంపీ ఓ ఆంజనేయులు , ఏపీవో ఉమా , ఏబీఎన్ సౌజన్య గారు, సర్పంచులు, గుర్రంపోడు తండా పార్వతీ రామారావు , కార్యదర్శిలు, రామావత్ రవీందర్ నాయక్, వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, గ్రామ ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin