సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ముఖ్యమంత్రి కెసిఆర్ నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను ఆయన ఎన్నోసార్లు నాకు గుర్తింపు ఇచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు.. నాలుగోసారి అవకాశం మళ్ళీ ఇచ్చారు. కృతజ్ఞతా భావంతో ఈ నియోజకవర్గాన్ని గెలిచి అభివృద్ధి కోసం కేసీఆర్ కు అందిస్తానని, ఎవరు ఊహించని రీతిలో తనను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడారు. తనపై ఎంతో విశ్వాసం ఉంచి నాలుగు పర్యాయాలు పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని మూడోసారి కూడా ప్రజల సహకారంతో గెలిచి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరోసారి పనిచేస్తానని అన్నారు. మొదటినుండి తనపై పెట్టిన విశ్వాసం ఎంతో గొప్పదని ఆయన ఆశయాల అడుగుజాడల్లో నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు, మీడియా, పార్టీ శ్రేణుల సహకారం ఎంతో గొప్పదని అందరికీ అందుబాటులో ఉండి మరింత అభివృద్ధి చేసేందుకు తనను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అంజయ్య కోరారు. ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి మిగతా రాష్ట్రాలకు ఒక మోడల్ తెలంగాణా రాష్ట్రమని అన్నారు. కెసిఆర్ పాలన గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్ని విషయాలు ప్రజలకు తెలుసని ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు విమర్శలు చేసిన ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుగులేని నేతగా అంజన్న భారత రాష్ట్ర సమితి పార్టీలో తిరుగులేని నేతగా ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అవతరించారని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ రాజా వరప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యే అంజయ్యకు అసెంబ్లీ టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేను పొగడ్తలతో ముచ్చెత్తారు. అందరికీ అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడు అభివృద్ధి కోసం పరితపించే గొప్ప వ్యక్తి అంజయ్య యాదవ్ అని, ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని మూడోసారి కూడా గెలిచి తన సత్తా చాటుతారని అన్నారు. 40 వేల మెజార్టీని సొంతం చేసుకోవడం ఖాయమని రాజా వరప్రసాద్ ప్రకటించారు. ప్రతిపక్షాలు ఎవరెన్ని అసత్య ఆరోపణలు చేసిన ఆయనను ఆయన కుటుంబాన్ని విమర్శించిన మౌనమే ఆయన సమాధానమని ఆ మంచితనమే నేడు ఆయనకు శ్రీరామరక్షగా మారిందని రాజా వరప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు కార్యకర్తలు పెద్ద ఎత్తున అభినందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి టికెట్ ఇవ్వడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేవు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి టిఆర్ఎస్ శ్రేణులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పూలమాలలు బొకేలు శాలువాలతో ఎమ్మెల్యే అంజయ్యను అభిమానంతో ముంచెత్తారు. అదేవిధంగా నాలుగవసారి కూడా ముఖ్యమంత్రి అభిమానం చూరగొన్న దరిమిలా ఎమ్మెల్యే అంజయ్యకు మీడియా తరఫున సీనియర్ జర్నలిస్టులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజా వరప్రసాద్, ఈట గణేష్, చైర్మన్ నరేందర్, ఎంపీపీ లక్ష్మణ్ నాయక్, తాండ్ర వెంకట్ రెడ్డి, పాతూరి వెంకట్రావు, చిలకమర్రి రవీందర్ రెడ్డి, నందారం అశోక్ యాదవ్, బీశ్వ రామకృష్ణ, వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్, శ్రీధర్ రెడ్డి, రామగళ్ళ సుందర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin