సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం లక్ష్మీపురం కోడిగుడ్లల ట్రై తయారీకి ఉపయోగించే అట్టల ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటన బుధవారం బుర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామం లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి . లక్ష్మీపురం గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి కి చెందిన కోడిగుడ్లల ట్రై తయారయ్యే అట్టల ఫ్యాక్టరీలో బుధవారం ప్రమాదవశాత్తు మహారాష్ట్ర కు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గత వారం రోజులు క్రితం ఈ ఫ్యాక్టరీ మూత పడి ఉందని మూత పడిన సమయంలో అట్టలకు ఉపయోగించే పలుపు గుజ్జు కుండీలో ఉండిపోవటంతో బుధవారం నిలవ ఉన్న పలుపు గుజ్జును తొలగించే క్రమంలో గ్యాస్ లీక్ అయి ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి చెందారని సమాచారం. అందులో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు కొన ఊపిరితో ఉండగా భద్రాచలం తరలించే క్రమంలో మృతి చెందాడు. ఇద్దరు మృతదేయాలను బుర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సంఘటన పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ సంఘటనపై బుర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....
-----------------------
Admin