సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డుకు చెందిన ఎరుకలి శివరాజ్ ఆధ్వర్యంలో చందాపురం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 20 మంది కార్యకర్తలు సోమవారం రోజున స్థానిక మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మక్తల్ మున్సిపాలిటీలో ఈసారి గులాబీ జెండాను ఎగరవేయాలని అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు ఇచ్చిన మాట తప్పిన పార్టీకి బుద్ధి రావాలంటే ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. మక్తల్ మున్సిపాలిటీని తీసుకువచ్చిన చరిత్ర బిఆర్ ఎస్ పార్టీకి దక్కుతుందని పార్టీకి ప్రజలు ఆదరణ ఇచ్చి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్, పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు, ప్రధాన కార్యదర్శి సందాపురం అశోక్ కుమార్ గౌడ్, తీర్మాలపూర్ కృష్ణ యాదవ్, సిరిపే రాములు, ఆంజనేయులు గౌడ్, కుర్మన్నయాదవ్, దొడ్డి రామలింగం, సిరిపే మోనేష్, దొడ్డి గోవిందు, నాగరాజు వాబీ,బాబు,నర్సింహా, ఎరుకలి ఉసేనప్ప తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు....
-----------------------
Admin