సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రజలు కాంగ్రెస్ జమ్మిక్కులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం అయ్యప్ప టెంపుల్, జంగోనిగూడ, అంతిరెడ్డి గూడ, నర్సప్పగూడ, వెంకమ్మగూడ, చేగూర్, బండోనిగూడ గ్రామాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ తోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయలేనిది ఇప్పుడేం చేస్తారు అని అన్నారు. ప్రజల ఓట్ల కోసమే కాంగ్రెస్ నాయకుల మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారని, వారి మాటలు నమ్మి మోసపోదన్నారు. అభివృద్ధిలో ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ వెనక్కి లాగాలని చూస్తుందన్నారు. రాష్ట్రానికి సాధించింది బీఆర్ఎస్ అభివృద్ధి చేసేది కూడా బీఆర్ఎసే అని అన్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు.
-----------------------
Admin