సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసేది తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కేంద్రంలో గల టౌన్ హాల్లో నిర్వహించిన నూతన సభ్యత్వాల కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.జర్నలిస్టులు ఐకమత్యంగా ఉండి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎల్ నాగబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గండిగుండ్ల రాము ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిలుకల చిరంజీవి ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి గొట్టే నాగరాజు యాదవ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా గౌరవ సలహాదారులు రామకృష్ణారెడ్డి సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షుడు బరిగెల విజయ్ కుమార్ హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు చిలక సైదులు వర్కింగ్ ప్రెసిడెంట్ పిడమర్తి నాగరాజు గరిడేపల్లి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి నూతనంగా సభ్యత్వం తీసుకున్న సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin