సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ జిల్లా డి .జె .ఎఫ్ కమిటీ అద్వర్యం లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది... అక్రిడేషన్తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్ రూంలు, ఇండ్ల స్థలాలివ్వాలి చిన్న, పెద్ద, అనే తారతమ్యం లేకుండా అన్ని సంక్షేమ రాయితీలు అందించాలి.చిన్న, మధ్య పత్రికలు డిజిటల్, వెబ్, యూట్యూబ్ న్యూస్ చానెళ్లు, వెబ్సైట్లలో పనిచేసే రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులతోపాటు ఇతర విభాగాల్లో పనిచేసే మీడియా ప్రతినిధులందరికీ అన్ని సంక్షేమ ఫలాలు అందించి ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో పాత్రికేయుల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో విస్తరించిన పాత్రికేయ సంఘం డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (డిజెఎఫ్). ఈ సంస్థలో ఇప్పటికే వేలాది మంది సభ్యులుగా చేరి అతిపెద్ద జర్నలిస్టుల సంఘంగా ఏర్పడిరది. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో డిజెఎఫ్ ప్రభుత్వంపై దశలవారీగా ఒత్తిడి తీసుకొస్తోంది.ఈ క్రమంలో నేడు జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో డి జె ఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు రఘునాథ్ శర్మ ,అధ్యక్షుడు ధర్మేంధర్ ,ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ,కోశాధికారి రాజేశ్వర్ ,కార్యదర్శి విలాస్ ,ఉపాధ్యక్షులు సుశీల్ ,భాను,శ్రీను,పాత్రికేయ మిత్రులంతా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
-----------------------
Admin