సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం ఏ.ఎం.సీ, కాలనీలో నిర్వహించిన మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ మాట్లాడుతూ.... అంబేద్కర్ సెంటర్లో డిసెంబర్ 6న మాల మహానాడు ఆధ్వర్యంలో జరగబోయే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును....ఈ కార్యక్రమానికి భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పొదెం వీరయ్య,టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకటరావు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ , పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి , పట్టణ అధ్యక్షులు గడ్డం స్వామి,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు చింతర్యాల రవి , పట్టణ అధ్యక్షుడు సరెళ్ల నరేష్ అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.కావున భద్రాచలంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అంబేద్కర్ వాదులు, బహుజన వాదులు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు... ఈ కార్యక్రమంలో అల్లాడి జయరాజు, శాంతిరాజు కనకరాజు, డేగల రామకృష్ణ, సుదర్శన్, డేగల రాజు, శాంతి, శివ, బల్లెం ఉదయ కాంత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin