సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగంగా విద్యా వారోత్సవాలలో చివరి రోజు అయిన నేడు జిల్లా వ్యాప్తంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలను సాధించిన విద్యార్థినీ విద్యార్థులను జిల్లా కేంద్రంలో ఈరోజు సన్మానించడం జరిగినది అందులో భాగంగా మోడల్ జూనియర్ కాలేజీలో చదివిన జల్లి గ్రామానికి చెందిన గంధం వెంకన్న, రాధికల కుమార్తె గంధం హాసిని ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలలో 971 మార్కులను సాధించడం జరిగింది ప్రభుత్వ కాలేజీలలో చదివి జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులను సాధించినందుకు గాను విద్యా వారోత్సవాల ముగింపు అయిన నేడు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద చేతుల మీదుగా సన్మానాన్ని పొంది ప్రశంసా పత్రాన్ని అదేవిధంగా పదివేల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని కూడా అందుకోవడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్ సుమన్ జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు గంధం హాసినిని మరియు వాళ్ళ అమ్మ గంధం రాధికని శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని మరియు 10,000 నగదు ప్రోత్సాహాన్ని అందజేయడం జరిగింది.ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని పెద్దలందరూ గంధం హాసినిని ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అమీనాబాద్ మోడల్ కాలేజ్ ప్రిన్సిపల్ చిట్ట జ్యోతి మరియు ఉపాధ్యాయులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter