సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు మధు ఆధ్వర్యంలో తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు గర్భిణీ స్త్రీలకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులు మధు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని, రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి యూత్ కాంగ్రెస్ తరపున మేము పార్టీకి ఎంతో కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపా శ్రీనివాసరావు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin