సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్నగర్ గౌరవ శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు ఈరోజు మఠంపల్లి మండలంలోని పాత దోనబండ తండా గ్రామంలో జరిగిన దేవాలయాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయా దేవాలయాల విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తెలంగాణ రాష్ట్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలోని గ్రామాలని సర్వతోముఖ వికాసాభివృద్ధి తో వెలసిల్లుతున్నాయని గిరిజన తండాలను అన్నిటిని గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసినటువంటి ఘనత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత శ్రీ కేసీఆర్ ది అని తెలియజేశారు.హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తూ ప్రతి గ్రామాలు అన్ని రంగాలలో సర్వతోముకంగా వికసిస్తూ ఆధ్యాత్మిక మరియు అభివృద్ధి సంక్షేమ రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నాయని ,ప్రజలకు ఆదయమార్గాలు కల్పిస్తూ వారి తలసరి ఆదాయాన్ని పెంపొందిప జేస్తూ..మౌలిక సదుపాయాల అభివృద్ధితో ప్రజల జీవంవిధానాన్ని సుఖవంతం చెంస్తున్నందువలననే గ్రామాలు నేడు కల కలడుతున్నాయని తెలియజేసారు...అదేవిదంగా నేడు హుజూర్నగర్ నియోజకవర్గం లో బడులు - గుడులు సంపూర్ణ వికాసంగా ఉన్నాయని నియోజకవర్గంలో 11 గురుకుల పాఠశాలలు కళాశాలలుగా అప్గ్రేడ్ అవుతూ ప్రతి ఒక్క పిల్లవానికి చదువుకునే అవకాశాలను కల్పిస్తున్నాయని అదే విధంగా గ్రామాలలో కూడా ఆధ్యాత్మికత పుట్టి పడుతూ బొడ్రాయి పండుగలు నూతన దేవాలయాలను నిర్మించుకొని ప్రజలు ఆధ్యాత్మికంగా కూడా సంతోషంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారని మరి అదేవిదంగా హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ఇప్పటికే 3500 కోట్ల రూపాయల అభివృద్ధితో శరవేగాముగా ముందుకు తీసుకొని వెళ్తున్నామని రానున్న రెండు నెలలు పనులని పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసి ప్రత్యక్షంగా చేసి చూపిస్తామని శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin