సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం దిగువపల్లి లో వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంచింగ్ ప్రోగ్రాం పై ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయడo జరిగింది.మహిళా సంఘ సభ్యులకు ఆసరా ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో ఏపిఎం రామనప్ప , ఎఫ్ బి ఓ, సి సి ,వి ఓ ఏ, ఎస్ హెచ్ జి ల సభ్యులు హాజరు కావడం జరిగింది.ఇందులో భాగంగాఏ పి ఎం రమనప్ప మాట్లాడుతూ... నేడు 25- 03 -2023 వ తేదీ నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఏలూరు జిల్లా దెందలూరు నందు మూడవ విడత వైయస్సార్ ఆసరా పథకం కు సంబంధించి నగదును మహిళా సంఘాల పొదుపు ఖాతాలకు జమకానున్నది. ఓబులదేవర చెరువు మండలంలోని 45 గ్రామ సంఘాలు 704 మహిళా సంఘముల పొదుపు ఖాతాలకు రేపటి రోజున 5,26,17,440/ రూ,, జమ కానున్నాయి. ఈ మొత్తాలు మహిళా సంఘాల సభ్యుల జీవనోపాధి మెరుగుదల, కొత్త జీవనోపాదుల ఏర్పాటుకు సద్వినియోగం చేసుకోవాలని వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని కోరుచున్నాము. ఈ విషయం పైన గత వారం రోజులుగా మహిళా సంఘాలు, గ్రామ సంఘాల వద్ద వైయస్సార్ ఆసరా పై సూచనలు, సలహాలు, సందేహాలు నివృత్తి చేయడం వంటి కార్యక్రమాల మీద ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించి తెలియజేయడమైనది. రేపటి రోజున మండల పరిధిలోని అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లైవ్ ప్రోగ్రాంను వీక్షించే నిమిత్తము మహిళా సంఘ సభ్యులకు అందరికీ తెలియజేయడం జరిగింది.ఇందులకు మహిళా సంఘ సభ్యులు అందరూ సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది.
-----------------------
Admin