Wednesday, 29 July 2026 07:23:04 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేడే వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత...

Date : 25 March 2023 08:39 AM Views : 534

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం దిగువపల్లి లో వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంచింగ్ ప్రోగ్రాం పై ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయడo జరిగింది.మహిళా సంఘ సభ్యులకు ఆసరా ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో ఏపిఎం రామనప్ప , ఎఫ్ బి ఓ, సి సి ,వి ఓ ఏ, ఎస్ హెచ్ జి ల సభ్యులు హాజరు కావడం జరిగింది.ఇందులో భాగంగాఏ పి ఎం రమనప్ప మాట్లాడుతూ... నేడు 25- 03 -2023 వ తేదీ నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఏలూరు జిల్లా దెందలూరు నందు మూడవ విడత వైయస్సార్ ఆసరా పథకం కు సంబంధించి నగదును మహిళా సంఘాల పొదుపు ఖాతాలకు జమకానున్నది. ఓబులదేవర చెరువు మండలంలోని 45 గ్రామ సంఘాలు 704 మహిళా సంఘముల పొదుపు ఖాతాలకు రేపటి రోజున 5,26,17,440/ రూ,, జమ కానున్నాయి. ఈ మొత్తాలు మహిళా సంఘాల సభ్యుల జీవనోపాధి మెరుగుదల, కొత్త జీవనోపాదుల ఏర్పాటుకు సద్వినియోగం చేసుకోవాలని వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని కోరుచున్నాము. ఈ విషయం పైన గత వారం రోజులుగా మహిళా సంఘాలు, గ్రామ సంఘాల వద్ద వైయస్సార్ ఆసరా పై సూచనలు, సలహాలు, సందేహాలు నివృత్తి చేయడం వంటి కార్యక్రమాల మీద ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించి తెలియజేయడమైనది. రేపటి రోజున మండల పరిధిలోని అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లైవ్ ప్రోగ్రాంను వీక్షించే నిమిత్తము మహిళా సంఘ సభ్యులకు అందరికీ తెలియజేయడం జరిగింది.ఇందులకు మహిళా సంఘ సభ్యులు అందరూ సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :