సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కేశంపేట్ మండల్ : దేశానికి వెన్నెముక అన్నం పెట్టే రైతన్న అని అలాంటి రైతన్నకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగడుగునా అండగా నిలుస్తూ రైతులను రాజు చేయడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు రూపొందించి అమలు పరుస్తున్నారని షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. రైతుల రుణమాఫీ సెప్టెంబర్ రెండవ వారంలోపు లోపు పూర్తి చేయాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేశంపేట మండలంలో సీఎం కేసీఆర్ తోపాటు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రూ.19,000 కోట్ల రుణాలను రైతుబంధు తరహాలో సెప్టెంబర్ రెండవ వారంలోపు మాఫీ చేయాలంటూ ఆర్థిక శాఖతోపాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమన్నారు. గతంలో రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేసేవారని కానీ నేడు అలాంటి పరిస్థితి లేదన్నారు. పెట్టుబడి సాయంగా రైతుబంధు ద్వారా నిధులు ఇస్తూ ఎరువులు, విత్తనాలను సైతం అందజేస్తున్నారన్నారు. వ్యవసాయ రంగానికి 24గంటల నిరంతర విద్యుత్ అందజేయడంతోపాటు పంట చేతికొచ్చాక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, పీఏసీఎస్ కొత్తపేట వైస్ చైర్మన్ అంజిరెడ్డి, షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తలసాని నారాయణరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు వెంకటరెడ్డి, కృష్ణ యాదవ్, నవీన్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, జి.కృష్ణయ్య, శ్రీలత శ్రీనివాస్, ఆంజనేయులు, సావిత్రి బాలరాజ్, కళమ్మవెంకటయ్య, ఎంపీటీసీలు దిద్దెల లక్ష్మమ్మలక్ష్మయ్య, మల్లేష్, యాదయ్య, కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, సీనియర్ నాయకులు శేఖర్ పంతులు, పర్వత్ రెడ్డి, యారం శేఖర్ రెడ్డి, సిలివేరు మల్లయ్య, మన్మథరెడ్డి, కొత్తపేట జగన్ రెడ్డి, జగత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin