సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్డు మలుపుల వద్ద వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని షాద్ నగర్ డివిజన్ ట్రాఫిక్ సీఐ శ్రీశైలం పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా నడపాలని, అలాగే వాహనాలను మలుపుల మలిపే క్రమంలో రెండు వైపులా చూసి వెళ్లాలని కోరారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి అని తెలియజేసారు. ముఖ్యంగా నీరు చేరడం వల్ల రోడ్లపైకి ఇసుక, మట్టి కొట్టుకొచ్చి వాహనాలు కింద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున వాహనం నడిపేవారు అతివేగంగా వెళ్లడం ద్వారా వాహనం అదుపుతప్పి కిందకు పడి గాయాలు అయ్యే అవకాశం ఉందని, కావున వాహనం నిదానంగా నడపవలెనని అన్నారు. వాహనం నడిపే సమయంలో రోడ్డుపై ఉన్న నీటి దగ్గర నిదానంగా వెళ్ళవలెను ఎందుకంటే ప్రస్తుతం రోడ్లు వర్షంతో తడిసి ఉండటం వల్ల రోడ్ల పైన అక్కడక్కడ గుంతలు ఉంటాయి కాబట్టి వాటిలో నీరు చేరడంతో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే నిదానంగా వెళ్లాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే 100 కి కాల్ చేయాలన్నారు.
-----------------------
Admin