సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఎస్సీ వర్గీకరణను వెంటనే అమల్లోకి తీసుకురావాలని అప్పటివరకు ఉద్యోగ నియమాకాలు నిలిపివేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతూ మరొక పోరాటానికి మాదిగ జాతిని సంసిద్ధం చేయడానికై జరుగుతున్న మాదిగల ధర్మ యుద్ధ ఉమ్మడి జిల్లా సదస్సులను విజయవంతం చేయడంలో భాగంగా గరిడేపల్లిమండల కేంద్రంలో ఎస్సీ కాలనీ వద్ద నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజూర్నగర్ ఎంజేఎఫ్ నాయకులు విశాఖ ఒగ్గు. హుజూర్నగర్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ఇంచార్జ్ బచ్చలకూరి ప్రసాద్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ గరిడేపల్లి మండల పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ నెల 4 వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే మాదిగల ధర్మ యుద్ధ ఉమ్మడి జిల్లా సదస్సును పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి అన్ని గ్రామాల నుండి మండలాల నుండి ఉద్యమ శ్రేణులను సమీకరించాలని కోరడం జరిగింది.4వ తేదీన జరుగు ఉమ్మడి నల్గొండ జిల్లా సదస్సులో ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ పాల్గొంటారని తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో బుడిగ వెంకన్న మాదిగ ఆధ్వర్యంలో చింతలచెరువు బాబు కొత్తపల్లిసుధాకర్ పిట్ట రవి పిట్ట శీను బుడిగ లాజర్ బుడిగ సైదులు మచ్చ సైదులు ఎం సైదులు ఉపేందర్ కొత్తపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin