సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ లో జరిగినటువంటి రాష్ట్ర మార్కెట్ కమిటీ చైర్మన్ ల సమావేశం గౌరవ గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి గారు ,నిజామాబాద్ AMC చైర్మన్ గంగిరెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో మార్కెట్ల అభివృద్ధి పనులు మరియు రైతుల సమస్యల గురించి ముఖ్యంగా చర్చించడం జరిగింది, మార్కెట్ కమిటీ ల సమస్యలను అందరూ కలసి కట్టుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను సత్వరమే పరిష్కారమయ్యే దిశగా కృషిచేయాలని సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు మరియు తెలంగాణ రాష్ట్రం లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు అందరూ పాల్గొన్నారు....
-----------------------
Admin