సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని లక్ష్మి నరసింహ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి సతీ సమేతంగా హాజరైన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, మహిళా భద్రతకు దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా షీ టీం ఏర్పాట్లు చేయడంతో మహిళలు స్వేచ్ఛగా వారి విధులు నిర్వహించుకోవడంతో పాటు ధైర్యంగా కాలేజీలకు, స్కూల్ లకూ వెళ్తున్నారనీ,గతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు .కరోనా సమయంలో మహిళా అధికారులు, అంగన్వాడి టీచర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళ డాక్టర్లు, సిబ్బంది చేసిన శ్రమ మాటల్లో చెప్పలేదని అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో భారీ బతుకమ్మలతో మహిళ సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణ లక్ష్మి నుండి, డెలివరీ అయిన తర్వాత ఇచ్చే కేసిఆర్ కిట్టు వరకు కూడా అందిస్తున్న ఘనత తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కె దక్కుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో... హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా అధికారులు అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎంలు, బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాళ్లు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin