సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : ఆరు గ్యారంటీ దరఖాస్తు స్వీకరణను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. ఇది దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. అర్హత ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చునీ, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఉంటే బాగుండని బీఆర్ఎస్ అనుకుంటోందనీ, తొమ్మిదేళ్లలో ఒక్కరికి కూడా రేషన్కార్డు ఇవ్వని ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదనీ విమర్శించారు. పేదలకు పంచిన భూములను గత ప్రభుత్వం లాక్కుందని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిరుపేదలకు భూములు అసైన్ చేస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వాటిని అమ్ముకున్నారని ఆరోపించారు. గ్యారెంటీ స్కీమ్ అమలు కోసం ప్రతి గ్రామంలో కౌంటర్ ఉంటుందనీ అన్నారు. జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారనీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాగా సీతారాములు సూచించారు. గత పాలకుల మాదిరి మా పార్టీలోకి వస్తేనే ఇల్లు, పెన్షన్ ఇస్తామనేది ఉండదని ఎన్నికలు అయిపోయాక రాజకీయాలు ఉండవని ప్రజలు అందరూ ప్రభుత్వానికి హక్కుదారులన్నారు.
-----------------------
Admin