సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సర్కార్ న్యూస్ మొగుళ్లపల్లి మొగుళ్ళపల్లి గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి, ఆదరించాలని, గ్రామ సర్పంచ్ గా గెలిపించి ప్రజాసేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చాట్ల విజయ-రవీందర్ దంపతులు మొగుళ్ళపల్లి గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు. శనివారం చాట్ల విజయ-రవీందర్ లు నామినేషన్ వేశారు. కాగా అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ ప్రజాదారణ కలిగిన నాయకుల కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వేట కొనసాగించారు. ఈ క్రమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా పేరున్న చాట్ల విజయ-రవీందర్ ను మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. చాట్ల విజయ భర్త రవీందర్ మండల కేంద్రంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తూ, నిరుపేద ప్రజలకు వైద్య సేవలను అందిస్తూ..ప్రజలలో మంచి గుర్తింపు పొందాడు. కుల, మతాలకతీతంగా చాట్ల రవీందర్ చేస్తున్న సేవలను మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రజలు నిరంతరం కొనియాడుతుంటారు. చాట్ల విజయ-రవీందర్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ప్రత్యర్థి పార్టీలలో సర్పంచ్ గా పోటీ చేయడానికి అభ్యర్థులు ఎవరు ముందుకు రావడం లేదు. దీన్ని బట్టి చూస్తే చాట్ల విజయ-రవీందర్ కు ప్రజలలో ఉన్న ప్రజాధారణ ఏంటో స్పష్టమవుతుంది. ప్రత్యర్థి పార్టీలపై ఆయన ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది. ఏదిఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. తన సేవలతో ప్రజల మనసును గెలుచుకున్న ఆర్ఎంపీ వైద్యుడు డాక్టర్ రవి సతీమణి సర్పంచ్ గా పోటీ చేస్తుండడంతో ప్రజలంతా ఆమె వైపు మొగ్గుచూపడం విశేషం.
-----------------------
Reporter