సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, మట్టపల్లి మహా క్షేత్రం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా నందు శ్రీ స్వామివారి తిరు కల్యాణ మహోత్సవములు, ది.21.05.2024 నుండి 26.05.2024 వరకు నిర్వహించుటకు గాను సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇట్టి కళ్యాణ మహోత్సవమునకు విచ్చేయు వేలాది మంది భక్తులకు ఎటువంటి ఆటంకములు జరగకుండా వివిధ శాఖల అధికారులతో హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయం నందు రాజస్వమండలాధికారి సురేష్ బాబు అధ్యక్షతన సమన్వయ సమావేశము నిర్వహించారు .ఇట్టి కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నల్గొండ, హుజూర్ నగర్ సి ఐ జి చలమంద రాజు , మఠంపల్లి తహసిల్దార్ మంగ, దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లి రావు విజయ్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి, మఠంపల్లి ఎస్సై రామాంజి గౌడ్ గౌడ్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు...
-----------------------
Admin