సర్కార్ టీవీ న్యూస్ / గద్వాల జిల్లా : గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు ఓ దొంగ.... ఈ సంఘటన గద్వాల పట్టణంలో శుక్రవారం రాత్రి సమయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గద్వాల బస్టాండ్ లోపల నుంచి బయటకు వస్తున్న సమయంలో ధరూర్ మండలం, భీంపురం గ్రామానికి చెందిన నలుగురు మహిళలను అనుసరించిన దొంగ అదును చూశాడు. ఒక మహిళ మెడలో నుంచి చైన్ లాక్కునేందుకు ప్రయత్నం చేశారు. దాంతో అప్రమత్తమైన మహిళలు గట్టిగా కేకలు వేయడంతో దొంగ పరారయ్యాడు. అటుగా వస్తున్న ఇద్దరు యువకులు బైక్ పై దొంగను వెంబడించినప్పటికీ దొంగలు బస్టాండ్ లోపలికి వెళ్లి తప్పించుకున్నారు. మెడలో నుంచి చైన్ లాక్కునేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తి తెల్ల చొక్కా వేసుకున్నాడని, సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు వయస్సు ఉంటుందని మహిళలు తెలిపారు. పోలీసులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బస్టాండు ఆవరణలో అనవసరంగా తిరుగుతున్న వ్యక్తుల పై ఓ కదలిక ఉంచాలని పట్టణ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు....
-----------------------
Admin