సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 60 లక్షల వ్యయంతో 5 మెషీన్స్ తో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్ ను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడు... కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేద వారికి ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా గాంధీ నిమ్స్ ఆసుపత్రిలో మాత్రమే ఉండేవి. ఈ సమస్యకు పరిష్కారంగా.. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం 3 నుంచి 83 కు పెంచింది. మరికొన్ని పెంచాలని లక్ష్యంతో ఉంది. యుద్ధ ప్రాతిపాదికన వీటిని ఏర్పాటు చేస్తున్నది. డయాలసిస్ రోగులకు ఆసరా పింఛను, ఉచిత బస్ పాస్కూడా ఇస్తున్నము. ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయు. షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 మెషిన్స్ తో 60 లక్షల వ్యయంతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేస్తున్నాం. డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, వైద్య శాఖామంత్రి హరీష్ రావు కి ప్రత్యేక కృతజ్ఞతలు.
-----------------------
Admin