సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గతంలో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగలపై నిఘా పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సిసిఎస్ పోలీసులకు పిలుపునిచ్చారు.వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సిటీ క్రైమ్ స్టేషన్ ను శుక్రవారం తనిఖీ చేశారు. తనిఖీల కోసం సిసిఎస్ కు చేరుకున్న సిపికి అధికారులు పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్ పరిశీలించిన అనంతరం సీపీ పాత నేరస్తుల ఫోటోలను పరిశీంచి, స్టేషన్ రికార్డులను పరిశీలించి,చోరీల నివారణకు తీసుకుంటున్న చర్యలను సీపీ సంబంధిత స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు,చోరీల నియంత్రణ కోసం చేపట్టాల్సిన ముందస్తూ చర్యలను అధికారులు సూచించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ చోరీ కేసుల్లో జైలు కి తిరిగి విడుదలయిన నిందితుల సమాచారం సేకరించాలని,ఇతర రాష్ట్రాల్లో చోరీ కేసుల్లో పట్టుబడిన నిందితుల వివరాలను అందుబాటులో వుంచుకోవాలని సీపీ తెలియజేసారు.ఈ తనిఖీల్లో క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి,ఏసీపీ సదయ్య,సిసిఎస్ ఇన్స్ స్పెక్టర్లు రాఘవేందర్,రామకృష్ణతో ఎస్.ఐ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Reporter