సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మూడురోజుల క్రితం కూలి పనులకు వెళ్లి వస్తూ కుమ్మరిపాడు పాములేరు వాగులో గల్లంతైన కుంజా సీతమ్మ (45) మృతదేహన్నీ శుక్రవారం మామిళ్ళగూడెం ముత్యాలమ్మగుడి ప్రాంతం లో గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని కాంగ్రెస్ నాయకులు, టిపిసిసి మెంబర్, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళ కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక తహసీల్దార్ తో చరవాణి లో మాట్లాడి ప్రభుత్వం నుంచి సహాయం అందే విధంగా చూడాలని కోరారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని న్యాయం చేయాలని, కుమ్మరిపాడు వాగు పై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ మృతదేహం లభ్యమైన స్థలాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. సీతమ్మ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆదుకోవాలని, పది లక్షల రూపాయల పరిహారం అందించి, కుమ్మరిపాడు వాగుపై వంతేన తక్షణమే నిర్మాణం చేపట్టాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన మహిళ కాబట్టే విపత్తుల నిర్వహణ టీం స్పందించలేదని, మృతదేహం ఆచూకి కోసం కనీసం ప్రయత్నం కూడా చేయలేదని ఆరోపించారు. మూడురోజులుగా స్థానిక గిరిజనులే వెతికి మృతదేహాన్నీ గుర్తించే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.
-----------------------
Admin