సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : మంసూరాబాద్ డివిజన్ సహారా రెండవ గేటు వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహం పక్కన పూలే యువజన సంఘం, ఓబీసీ పీపుల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ నూతన విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులు, విగ్రహ దాతలు ముద్దగోని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలతో సత్కరించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జ్ఞాపకాలని స్మరించుకుంటూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను వాళ్ల ఆశయాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీపిసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, లింగోజిగూడ డివిజన్ కార్పోరేటర్ దర్పల్లీ రాజశేఖర్ రెడ్డి, బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్,పన్యాల జైపాల్ రెడ్డి,జెనిగే విష్ణువర్ధన్, ఇరిగి రమేష్,చామకూర రాజు, మేడిగా శ్రీధర్,బొంగు వెంకటేశ్ గౌడ్,ఇరిగే రమేష్, బిక్షం గౌడ్,సిలివెరు వెంకట్ గౌడ్,యాదగిరి గౌడ్, రవి గౌడ్, శ్రీనివాస్, బుద్ద సత్యనారాయణ, జె. రాజు, సరస్వతీ,స్వప్న, ఆర్టీసీ కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin