సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో తహసిల్దార్ వారి కార్యాలయము మండల తహసిల్దార్ కే శ్రీధర్ అధ్యక్షతన వీఆర్వో మరియు వీఆర్ఏ లకు శిక్షణ కార్యక్రమము నిర్వహించబడినది. 11వ వ్యవసాయ గణన భూకమతాల లెక్కింపు మండల స్థానిక కార్యాలయంలో భూకమతాల లెక్కింపు పై ఎనుమరేటర్స్ ఐనా వీఆర్వోలకి భూకమతాలపై శిక్షణ కార్యక్రమం జరపడమైనది. ఇందులో ఇనుమురేటర్లైనా వీఆర్వోలు వ్యవసాయదారుల యొక్క వ్యవసాయ సాగు వివరాలు మరియు వారి చిరునామాలు సేకరించడం జరుగుతుంది . దీని ద్వారా వాస్తవిక వ్యవసాయ కమతాల లెక్కింపు, మహిళా రైతుల కమతాలు మరియు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల కమతాలు మొదలైన వివరాలు తెలియను. ఈ గణన ద్వారా దేశవ్యాప్తంగా వ్యవసాయ అభివృద్ధికి పాటించవలసిన విధి విధానాలను చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కే శ్రీధర్, ఏ ఎస్ ఓ ప్రణీత మరియు అందరూ వి.ఆర్.ఓ లు, వీఆర్ఏలు పాల్గొన్నారు
-----------------------
Admin