సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం డిపో యూత్ ఆధ్వర్యంలో T-10 కప్ రాష్ట్రస్థాయి ఓపెన్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నో బాలరాజ్ ఇంజనీరింగ్ కళాశాల కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ను ముఖ్య అతిధులు శ్రీ సురక్ష హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అక్కినేని. లోకేష్, ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ వరలక్ష్మి,BRS సీనియర్ నక్కా.ప్రసాద్. టిడిపి సీనియర్ నాయకులు షేక్ అజీమ్ లు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని తెలిపారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన డిపో యూత్ నిర్వాహకులను అభినందించారు. అలాగే ఈ సందర్భంగా టి-10 కప్ డిపో యూత్ నిర్వాహకులు మాట్లాడుతూ విజేతజట్టుకు బహుమతి నగదు రూ.50,000 రూపాయలను నక్క ప్రసాద్ గారు వారి తల్లిదండ్రుల నక్కా. రామారావు , నరసింహారత్నం గార్ల జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరిగిందని అలాగే రన్నరప్ రూ.30,000 రూపాయలను ప్రముఖ ఐటిసి కాంట్రాక్టర్ పాకాల.ప్రసాద్ గారు ఇవ్వడం జరిగినదని తెలిపారు. ఈ టోర్నమెంటు 30 |12|2022 నుండి 10| 01|2023 వరకు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ప్రతీ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అందజేస్తున్నారు అని తెలిపారు. ఈ టోర్నీ లో నగదుతోపాటు, ట్రోపి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ , మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ , బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ ఇస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ నిర్వాహకులు రాజు గారు, మినీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ .జిందా ,మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కొప్పుల.మురళి జెట్టి.శ్రీను , ఆర్కే షాపింగ్ మాల్ అధినేత కోటేష్ గారు మరియు డిపో యూత్ ఆర్గనైజింగ్ నిర్వాహకులు పాల్గొన్నారు.
-----------------------
Admin