సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ (టిఆర్ఎస్) పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం బిఆర్ఎస్ మండల పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా ఆమోదించడంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మిఠాయిలు పంచి టపాకాయలు కాల్చి ఘనంగా సంబురాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు లింగాగౌడ్,మండల నాయకులతో కలిసి వారు మాట్లాడాతు .ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయల్లోకీ వెళ్లడం శుభసూచకమని దేశంలో "కేసీఆర్ రావాలి దేశం మారాలి" విదంగా దేశ ప్రజలు మద్దతు ఉంటుందని వారు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,ప్రవేశ పెట్టిన పథకాలే దోహదపడుతుంది వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు సర్పంచులు,ఉప సర్పంచ్ లు,సొసైటీ డైరెక్టర్స్ , ,ఎంపీటీసీలు,రైతు బంధు మండల,గ్రామ కో ఆర్డినేటర్ లు,డైరెక్టర్లు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,సొసైటీ చైర్మన్,వైస్ చైర్మన్,మండల,గ్రామ,కోప్షన్ సభ్యులు,ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులు,మండల,గ్రామ అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin