సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం లో బిజెపి యువ నాయకుడు ఏపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని శ్రీ చౌడమ్మ గుట్ట దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్త భజన, పల్లకి సేవ, గోసేవ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అనంతరం పట్టణంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంగళూరు ఎమ్మెల్యే వేద వ్యాస్ కామత్, సీనియర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి, ప్రేమ్ రాజ్, జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, స్థానిక నేతలు డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్, తదితర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజక వర్గాల నుండి బిజెపి ముఖ్య నాయకులు హాజరయ్యారు.
-----------------------
Admin