సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : లక్ష్మీదేవిపల్లి మండలం లోని మైలారం మధ్యగుంపులో గల గుత్తి కోయ గ్రామాన్ని చుంచుపల్లి సర్కిల్ సీఐ పెద్దన్న కుమార్, లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ పి సంతోష్ సందర్శించి కాటన్ సర్చ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోకి అపరిచిత వ్యక్తులు ఎవరైనా వస్తే వారికి ఆశ్రయం కల్పించవద్దని పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగగా అక్కడ ఉన్న స్థానికులు ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నా గానీ తమకు విద్యుత్ సౌకర్యం లేదని, వర్షాకాలం కావడం వల్ల మబ్బులు పట్టిన సమయంలో సోలార్ మోటార్ పనిచేయక నీళ్లకు ఇబ్బందులు పడుతున్నట్టు సీఐ ఎస్ఐ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను సంబంధిత శాఖ వాళ్ళ దృష్టికి తీసుకు వెళ్తామని సీఐ పెద్దన్న కుమార్ ఎస్సై పి సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పార్టీ సిబ్బంది లక్ష్మీదేవిపల్లి కానిస్టేబుళ్లు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin