సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మున్సిపాలిటి పరిధిలో సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ జయ రామ నినాదాలతో ఆట పాటలతో, భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. షాద్నగర్ మున్సిపల్ కౌన్సిలర్ మాధురి నందకిషోర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు రఘుపతిరావు, ప్రమోద్, సునీల్ పంతులు, భక్తులందరికీ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఫరఖ్ నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన శంకరయ్య దంపతులు దంపతులు వారి కుటుంబ సభ్యులు దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పులిమామిడి శ్రీశైలం గౌడ్ శాలువా పూలమాలతో కౌన్సిలర్ దంపతులను, అన్నదాతలను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా బియ్యం దానం చేసిన తులసి రామ్ నాయక్ మరియు కూరగాయల దాత రాఘవేందర్ లను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి, అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పల్లకి సేవలో పులిమామిడి శ్రీశైలం గౌడ్, అన్నారం రఘు గౌడ్, రమేష్ ముదిరాజ్, రఘునందన్ రెడ్డి, లక్ష్మణ్, కిషన్ నాయక్, రాఘవేందర్, రమేష్, సుప్ప నర్సింలు, నారాయణ, శ్రీనివాస్, కృష్ణయ్య, లక్ష్మికాంత్ రెడ్డి, కృష్ణ చారి, శంకర్ గౌడ్, పద్మా వెంకటేష్, గోరియా నాయక్, వీఆర్వో బచ్చన్న, సత్తయ్య, శ్రీనివాస్, రవీందర్, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin