సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ డివిజన్లో నాలుగు (చించోడు, కొందుర్గు, కేశంపేట్, నందిగామ) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య మహిళా ప్రోగ్రాం ప్రారంభోత్సవం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందిగామ లో ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా షాద్ నగర్ డివిజన్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రతి మంగళవారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్త్రీలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి వారికి వచ్చే ప్రాబ్లమ్స్ బ్రెస్ట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, గర్భసంచి కాన్సర్, రుతు శ్రవాల సమస్యలు గురించి, తెల్లబట్ట గురించి, గర్భసంచి సమస్య లో గురించి, సంభోగం వలన వచ్చే వ్యాధుల గురించి, ఆడవాళ్లకు సంబంధించిన మొత్తం సమస్యల గురించి పరీక్ష నిర్వహిస్తారని డాక్టర్ యస్. జయలక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ వై. యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ ఆసుపత్రిలో కెసిఆర్ కిట్టు తో పాటు న్యూట్రిషన్ కిట్టు గర్భవతులకు ఇచ్చుకుంటూ స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళ ఆరోగ్య కార్యక్రమంలో గ్రామాల లోని స్త్రీలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, స్త్రీలకు వచ్చే సమస్యలు, స్త్రీ వైద్యాధికారితో సంపూర్ణంగా వివరించుకొని, చికిత్స చేయించుకొని, పరీక్షలు చేయించుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ అవకాశాన్ని అందరు స్త్రీలు ఉపయోగించుకుని, వారి ఆరోగ్యం కాపాడుకోవాలని తెలియచెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గణేష్, ఎంపీపీ ప్రియాంక, సర్పంచ్ వెంకటరెడ్డి, ఎంపీటీసీ కుమార్ గౌడ్, కృష్ణయ్య, ఎక్స్ మార్కెట్ చైర్మన్ నారాయణరెడ్డి, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆర్ఐ, డాక్టర్ తులసి, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు, సూపర్వైజర్ అమృత, సువర్ణ, ఫార్మసిస్ట్ రాజు నాయక్, లాబ్ టెక్నీషియన్ యాదగిరి, ఏఎన్ఎంలు, ఆశలు పాల్గొన్నారు.
-----------------------
Admin