Thursday, 30 July 2026 10:34:17 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రైవేటు జూనియర్ కళాశాలలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు...

Date : 03 November 2022 10:49 PM Views : 461

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : ప్రైవేటు జూనియర్ కళాశాలలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అనంతపురం జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. అనంతపురం విద్య: ప్రైవేటు జూనియర్ కళాశాలలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్బోర్డు నిబంధనలు పాటించకపోవడంతో రూ. 5 లక్షలు జరిమానా విధించారు. విద్యాసంస్కరణల్లో భాగంగా నియమించిన జిల్లా మానిటరింగ్, సూపర్వైజర్ కమిటీ బుధవారం సోములదొడ్డి సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసింది. కమిటీ చైర్పర్సన్ కేతన్గార్గ్ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. పరిశీలనలో అధిక సమయం వరకు తరగతులు నిర్వహిస్తున్నారని, విద్యార్థులకు క్రీడలు లేవని గుర్తించారు. వసతిగృహంలో సరైన తాగునీటి సరఫరా, వేడినీరు లేవని గుర్తించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. తమను బాధిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. దీంతో జేసీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కమిటీ ప్రతినెలా 2 కళాశాలల్లో పర్యటిస్తుందని, విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత కుమార్, డీవీఈవో వెంకటరమణనాయక్, డీఈఓ శామ్యూల్, ఆరైవో సురేష్బాబు, సైక్రియాటిస్ట్ రవికుమార్, స్త్రీశిశు సంక్షేమశాఖ పీడీ శ్రీదేవి, ఫుడ్ఆన్ఇన్స్పెక్టరు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :